Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గుజరాత్లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వడోదరలోని సర్ సాయాజీరావు ఆస్పత్రి ఐసీయూలో ఓ కొవిడ్ బాధితురాలు చికిత్స పొందుతుండగా ఆమె ముఖంపై వందలాదిగా చీమలు దర్శనమిచ్చాయి. చీమలు విపరీతంగా కుట్టడంతో ఆమె ముఖమంతా వాచి పోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను బాధితురాలి భర్త సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయటంతో అది విపరీతంగా వైరల్ అయింది. కాగా రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.