Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబాబాద్: జిల్లాలో అటవీశాఖ సిబ్బంది అత్యూత్సాహం శృతిమించుతుంది. రైతుల పట్టాభూమిలో వ్యవసాయ బావి పూడ్చేసి కందకాలు తీసేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న ముగ్గురు బాధితులు అటవీశాఖ సిబ్బందిని నిర్బంధించారు. నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామ సమీపంలో సంఘటన చోటుచేసుకుంది. లంచం డబ్బులు ఇవ్వనందుకే తమ వ్యవసాయ బావిని పూడ్చారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు శోభన్ బాబు, జనార్థన్, యాకుబ్లను రైతులు నిర్బంధించారు. ఉన్నతాధికారులు వస్తేనే వదిలి పెడతామని హెచ్చరించారు.