Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. అక్క, చెల్లి ఇద్దరూ దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బళ్లారి జిల్లా కూడ్లగి తాలూకా బెనకనహళ్లి గ్రామానికి చెందిన గౌరమ్మ (34), రాధిక (32) లు కూలిపనులు చేసే వారు. వీరు మూడు రోజులుగా కనిపించలేదు. వీరి సమీప బంధువు చంద్రమ్మ వీరికి పలుమార్లు ఫోన్ చేసినా స్విచాఫ్ రావడంతో అనుమానంతో శుక్రవారం ఉదయం ఇంటికి వద్దకు వెళ్లింది. అయితే దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. ఇటీవల గౌరమ్మ భర్త మంజునాథ్ ఇంటికి వచ్చి గొడవ పడినట్టు సమాచారం. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వీరు 3 రోజుల కిందటే హత్యకు గురయ్యారని అనుమానిస్తున్నారు.