Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు ప్రతిపక్షాల నుంచి సరైన మద్దతు కనిపించడం లేదని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నేత హర్సిమ్రత్ కౌర్ బాదల్ అన్నారు. ప్రతిపక్షాలు వెంటనే ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను హర్సిమ్రత్ కౌర్ నేతృత్వంలో ఓ బృందం శనివారం కలిసింది. ఈ బృందంలో బహుజన్ సమాజ్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, జమ్మూ-కశ్మీరు నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు ఉన్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.
తాను కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే నేతలతో మాట్లాడానని, కలిసికట్టుగా సమస్యలపై పోరాడుదామని చెప్పానని అన్నారు. అయితే నేడు తమతో కలిసి వచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం విచారకరమన్నారు. ప్రతిపక్షాలు ఏకమయ్యే వరకు ప్రభుత్వం లబ్ది పొందుతుందన్నారు.