Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: 'ఆర్ఆర్ఆర్' షూట్తో ఫుల్ బిజీగా ఉన్న తారక్ తాజాగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో సందడి చేశారు. ఆయన రాక పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. శంకర్పల్లి మండలం పరిధిలోని గోపాలపురంలో తారక్ ఇటీవల ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. ఆ భూమి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం ఆయన శుక్రవారం మధ్యాహ్నం శంకర్పల్లి ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చారు. ఎన్టీఆర్ రాకతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. కార్యాలయంలోని ఉద్యోగులు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. రిజిస్ట్రేషన్ పనులు పూర్తైన వెంటనే కొంతమందితో ఫొటోలు దిగిన ఆయన హైదరాబాద్కు పయనమయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.