Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వైద్యరంగంలో సంచలనం నమోదైంది. ఓ ఆడశిశువు తన తల్లి గర్భంలో ఉండగానే గర్భం దాల్చింది. నవజాత శిశువులో ఒక్కటి కంటే ఎక్కువ పిండాలు ఉండటం వైద్యులు గుర్తించారు. ఈ ఘటన ఇజ్రాయిల్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకెళ్తే.. ఇజ్రాయెల్లోని ఆష్డోడ్ పట్టణంలోని ఆస్సుటా మెడికల్ సెంటర్లో ఈ నెల తొలి వారంలో ఒక మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే, ప్రసవ సమయానికి ముందు గర్భిణికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు జరిపిన వైద్యులు.. గర్భంలోని ఆడశిశువు పొట్టభాగం సాధారణంగా ఉండాల్సిన ఎత్తుకన్నా ఎక్కువగా ఉండడం వైద్యులు గుర్తించారు. ప్రసవం అనంతరం చిన్నారికి వైద్యులు ఆల్ట్రా సౌండ్, ఎక్స్రే పరీక్షలు జరిపారు. నవజాత శిశువు కడుపులో ఒకటికన్నా ఎక్కువ పిండాలు ఉన్నట్లు గుర్తించారు. దాంతో వెంటనే నియోనాటాలజీ విభాగం డైరెక్టర్ ఓమర్ గ్లోబస్ నేతృత్వంలో చిన్నారికి సర్జరీ చేసి పలు పిండాలను బయటకు తీశారు. తల్లి గర్భంలో కవల పిండాలు తయారవుతున్న సమయంలో కొంత వృద్ధి చెందిన పిండంలోకి మరో పిండం పోవడం వల్ల ఇలాంటివి వెలుగులోకి వస్తాయని డాక్టర్ ఓమర్ గ్లోబస్ తెలిపారు. బయటకు తీసిన పిండాలు ఇప్పుడిప్పుడే రూపాలను సంతరించు కుంటున్నాయన్నారు.