Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సెమీస్లో చైనీస్ తైపీ షట్లర్ తై జూ యంగ్తో జరిగిన మ్యాచ్ లో పీవీ సింధు ఓడిపోయింది. మొదటి సెట్ లో ప్రత్యర్థితో సింధు పోరాడినా 18-21తో ఓడిపోయింది. రెండో సెట్ లో తై జూ యంగ్ దూకుడుగా ఆడడంతో పీవీ సింధు ఆమె ముందు నిలవలేకపోయింది. 12-21తోగేమ్ ను కోల్పోయింది. దాంతో చైనీస్ తైపీ షట్లర్ 2-0తో విజయంసాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. సింధుకు ఇక బంగారు పతకం ఆశలు గల్లంతైన నేపథ్యంలో హి బింగ్ జియావోతో ఆమె ఆదివారం కాంస్య పతకం కోసం పోరాడనుంది. ఆ మ్యాచ్ ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరగనుంది.