Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నగదు లావాదేవీలపై ఐసీఐసీఐ బ్యాంకు పరిమితిని విధించింది. అలాగే పలు కొత్త నిబంధనలు ఆగస్టు 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంకు అమల్లోకి తేనుంది. నగదు జమ, వెనక్కి తీసుకునేందుకు మొత్తం 4 ఉచిత లావాదేవీలనే అనుమతించి ఆ తర్వాత నుంచి ప్రతీ లావాదేవీకి రూ.150 రుసుము విధించనుంది. హోం బ్రాంచ్లో నగదు లావాదేవీ పరిమితి నెలకు రూ.1లక్ష వరకు ఉచితంగా ప్రకటించింది. లక్ష రూపా యలు దాటితే మాత్రం ప్రతీ రూ.1000కి రూ.5 చార్జీ వసూలు చేయనుంది. ఇది కనిష్ఠంగా రూ.150కు లోబడి ఉంటుందని బ్యాంక్ తెలిపింది. నాన్ హోమ్ బ్రాంచ్ వద్ద రోజుకు రూ.25,000 వరకు నగదు లావాదేవీలకు ఛార్జీలు ఉండవని.. రూ.25,000 పైన ప్రతీ రూ.1000కి రూ.5 ఛార్జీ వసూలు చేయనుంది. కనీసం రూ. 150కి లోబడి ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది.
మూడో వ్యక్తులు చేసే నగదు జమలపైనా పరిమితులు విధించింది. రూ.25,000 వరకూ రూ.150 రుసుము వసూలు చేయనుంది. ఆపై జమను అనుమతించదు. ఏడాదికి 25 చెక్కులు ఉచితంగా ఇస్తుంది. ఆ తర్వాత 10 చెక్కులుండే ఒక్కో చెక్బుక్కు రూ.20 చెల్లించాలి.