Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామపంచాయితీ ఎన్నికలు 2019జనవరిలో జరిగాయి. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా పంచాయితీలను ఎన్నుకుంటే ప్రోత్సాహక నిధులిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పంచాయితీ ఎన్నికలు జరిగి నేటికి 30 మాసాలు దాటినా ప్రోత్సాహక నిధులు విడుదల చేయలేదు. గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్, వార్డుమెంబర్లపై ప్రజల నుండి ఒత్తిడి పెరుగుతున్నది. తక్షణమే ఈ పంచాయితీలకు నిధులు విడుదల చేసి ఆయా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తున్నది.
స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని, నిధులు అందుబాటులో ఉంచుతామని అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏకగ్రీవ పంచాయితీలకు రు.10లక్షల ప్రోత్సాహక జీవో కూడా జారీ చేశారు. రాష్ట్రంలోని 12,751 పంచాయితీల్లో 1935 ఏకగ్రీవమయ్యాయి. గ్రామాభివృద్ధికోసం ఈ పంచాయితీలను ఏకగ్రీవం చేసుకుని, ఏయే పనులు అత్యవసరమో కూడా చర్చించుకుని అప్పటినుండి ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ పంచాయితీలకు ఇవ్వాల్సిన రు.193 కోట్లు ప్రభుత్వం నేటికీ ఇవ్వలేదు. దీనివల్ల భవిష్యత్లో ఏకగ్రీవాల ప్రోత్సాహకాల పట్ల ప్రజలు నమ్మకం కోల్పోతారు. ప్రభుత్వ ప్రకటనలకు విలువ లేకుండా పోతుంది.
ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఏకగ్రీవ పంచాయితీలకు నిధులు విడుదల చేసి ముఖ్యమంత్రి చేసిన మాటమీద నిలబడాలని సీపీఐ(ఎం) కోరుతున్నది.