Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దళిత బంధు పేరుతో సీఎం కేసీఆర్ మరోసారి దళితులను మోసం చేసే కుట్ర చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిలదీయాలన్నారు. 10 లక్షలు ఇస్తావా, చస్తావా అని అడగాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో దళిత, గిరిజనులకు భూములు ఇస్తే. కేసీఆర్ సర్కార్ పోలీసులతో దాడులు చేసి.. ఆ భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు కేసీఆర్ ఎన్ని భూములు పంచారో శ్వేత పత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలయ్యే విధంగా చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాలను పెడ్తే దళిత బంధుపై ఏకగ్రీవ తీర్మానం చేస్తామని ఆయన చెప్పారు. ట్యాంక్ బండ్ పక్కనే ఉన్న సచివాలయం భూములని, లేదంటే ప్రగతి భవన్ను అమ్మి ఇచ్చిన మాకు అభ్యతరం లేదన్నారు. ప్రపంచ గిరిజన దినోత్సవం ఆగస్ట్ 9 నుంచి దళిత గిరిజన దండోరాను మొదలుపెట్టబోతు న్నామని తెలిపారు. అధిష్ఠానం కూడా దళిత, గిరిజన దండోరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు.