Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 621 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 691 మంది కోలుకున్నారు. ఇన్ఫెక్షన్ కారణంగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 6,44,951కి పెరిగాయి. ఇవాళ్టివరకు మొత్తం 6,32,080 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇంకా 9069 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 3,802కు చేరాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తన నివేదకలో వెల్లడించింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 1,13,012 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు పేర్కొంది.