Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న న్యాయవాదులకే ప్రత్యక్ష విచారణలో పాల్గొనేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. న్యాయవాదులు, ఇతర న్యాయ సిబ్బంది కరోనా నియామవళి తప్పనిసరిగా పాటించాలని నిర్దేశించింది. ఈ మేరకు రాష్ట్రంలోని కోర్టులు, ట్రైబ్యునళ్లకు తెలంగాణ హైకోర్టు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆగస్టు 9 నుంచి పలు కేసుల ప్రత్యక్ష విచారణ చేపడుతున్నట్టు వెల్లడించింది. అయితే ఇది పాక్షికమేనని, సెప్టెంబరు 9 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వివరించింది. అది కూడా రోజుకొక ధర్మాసనం, ఇక సింగిల్ బెంచ్ కు ప్రత్యక్ష విచారణ అవకాశం కల్పిస్తామని హైకోర్టు తెలిపింది. ఆగస్టు 8 వరకు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా కోర్టుల్లో ఆన్ లైన్ లో విచారణ ఉంటుందని వివరించింది.