Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాజీవ్గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలో గల నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిఫుల్ ఐటీలో 2021-22 విద్యా సంవత్సరం ప్రవేశాలకు శనివారం నోటిఫికేషన్ విడుద లైంది. ఆరేళ్ల బీటెక్ సమీకృత కోర్సుల్లో చేరేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నా రు. పదో తరగతి పాసై.. పాలిసెట్ రాసిన వారే అర్హులు కాగా, మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయించనున్నారు. రేపటి(సోమవారం) నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. అర్హుల జాబితాను ఈనెల 18వ తేదీన ప్రకటించనున్నారు. దరఖాస్తులను admissions@rgukt.ac.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ : 63048 93876