Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకొని మోసాలు చేస్తున్న వ్యక్తిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మోలాలి వెంకటేశ్వర కాలనీకి చెందిన వేమినేని శ్రీనివాసరావు కొంతమంది నుంచి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని చెప్పి రూ. 12.75 లక్షలు తీసుకున్నాడు. అనంతరం ఎలాంటి ఫలితం లేకపోవడంతో బాధితులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాసరావును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.