Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హుజూరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం క్యాబినెట్ సమావేశం జరగనుంది. దళిత బంధును హుజూరాబాద్లో ఫైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని భావిస్తున్న ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో ముహూర్తం ఖరారు చేసే అవకాశాలున్నాయి. తెలంగాణ క్యాబినెట్ ప్రగతి భవన్లో భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధుని అర్హులైన అందరికి అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించడానికి ఒక తేదీని ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే అధికారులు అందుకోసం పూర్తి స్థాయిలో లెక్కలు సేకరిస్తున్నారు. నియోజకవర్గంలో ఎంతమంది అర్హులు ఉన్నారు? దళితవాడల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అనే అంశాలతోపాటు దళిత బీమాపై కూడా చర్చించనున్నారు. అలాగే చేనేత బీమాపై కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశముంది.