Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : లాల్ దార్వాజ బోనాల ఉత్సవాల సందర్భంగా చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారికి, పాతబస్తీ హరి బౌలి లో గల బంగారు మైసమ్మ అమ్మవారికి, శాలిబండ లోని అక్కన్న మాదన్న ఆలయంలో, ఉప్పుగూడ లోని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల వద్ద పూర్ణకుంభంతో వేదపండితులు మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల పండుగను రాష్ట్ర పండుగ గా ప్రకటించి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని అమ్మవారిని కోరుతున్నట్టు మంత్రి తెలిపారు. లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయంలో తలసానితో పాటు హోంమంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలు అమ్మవారిని దర్శించుకున్నారు.