Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మధ్యప్రదేశ్లో ఘెరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. దాంతో 13 మంది వరకు గాయపడగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. భోపాల్ పోలీసు అధికారి కమలేష్ సోని తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 5:40 గంటల ప్రాంతంలో భోపాల్ నుంచి సాగర్ హైవేమీద ప్రయాణిస్తున్న ఓ బస్సు భోపాల్లోని విదిష నగరానికి సమీపంలో హిర్ని గ్రామం వద్ద అదుపతప్పి బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్టు గుర్తించారు. సమాచారం అందగానే పోలీసులు హుటాహుటీన ప్రమాద స్థలానికి చేరుకుని.. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. అయితే, ప్రయాణికులలో 13 మంది వరకు గాయపడ్డారని, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వీరిని మెరుగైన వైద్యం కోసం భోపాల్లోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.