Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో ఆగస్టు నెల అధ్యక్ష బాధ్యతలను భారత్కు అప్పగిం చారు. ఈ మేరకు అధ్యక్ష బాధ్యతలను భారత ప్రతినిధి తిరుమూర్తి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్ర భద్రత, శాంతి పరిరక్షణ, ఉగ్రవాద కట్టడిపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఆయా అంశాలపై ఈ నెలలోనే సంతకాల సేకరణ చేపడుతామన్నారు. ఐరాస భద్రతా మండలిలో నెలకొక దేశం అధ్యక్ష బాధ్యతల నిర్వహణ చేపడుతున్న సంగతి తెలిసిందే. జులై నెలలో అధ్యక్ష బాధ్యతలను ఫ్రాన్స్ నిర్వహించింది.