Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగు తోంది. ఇందులో దళితబంధు, చేనేత బీమా, కరోనా పరిస్థితులపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దళితబంధు పథకంపై సమావేశంలో చర్చ జరగనుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుకు మంత్రిమండలి ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది.
దళితబంధు విధి విధానాలు మంత్రిమండలి ఖరారు చేయడంతో పాటు, ఈ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దళితవాడల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపైనా కేబినెట్లో చర్చించనున్నట్టు సమాచారం. ఉద్యోగ నియామకాలపైనా కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే కరోనా మూడో వేవ్కు సంబంధించి తీసుకునే ముందస్తు జాగ్రత్తలపై, వ్యాక్సినేషన్ పై కేబినెట్ భేటీలో చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అందుకు సంబంధించి తదుపరి కార్యాచరణపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది.