Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పాతబస్తీలోని లాల్దర్వాజ సింహవాహినీ మహంకాళి ఆలయంలో అమ్మవారిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆదివారం బోనాల సందర్భంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనం ఎత్తిన ఆడబిడ్డలందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను హిందూ, ముస్లింలు కలిసి జరుపుకుని హైదరాబాద్ అంటే సర్వమత సమ్మేళనంగా కలసి ఉన్నామని ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. మత సామరస్యానికి లాల్దర్వాజ బోనాలు ప్రతీక అన్నారు. నిజాం పాలనలో హైదరాబాద్లో కలరా వచ్చినప్పుడు అమ్మవారికి నిజాం నవాబు మొక్కుకొని బంగారు ముక్కు పుడక సమర్పించారని చెప్పారు. ఇప్పుడు కరోనా నుంచి ప్రజల్ని కాపాడడానికి అమ్మవారి ఆశీర్వాదం కావాలన్నారు.