Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: చాక్లెట్లంటే అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు చాలా మంది ఇష్టంతో తింటుంటారు. అయితే అలాంటి చాక్లెట్లు ఒకేసారి కుప్పలుగా రోడ్డుపై కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా. అందరు వచ్చి ఏరుకుని తీసుకుంటారు అలాంటి ఘటనే ఏపీలోని నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. కానీ ఆ చాక్లెట్లు కాలం చెల్లినవి అని తెలియడంతో వారంతా ఊసూరుమన్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరులోని ఏసీ నగర్లో గుర్తుతెలియని వ్యక్తులు.. రోడ్డు పక్కన చాక్లెట్లు, ప్రోటిన్ పౌడర్లను కుప్పలుగా పారబోశారు. అయితే, వీటిని కొందరు చూసి ఏరుకుని ఇంటికి తీసుకెళ్లారు. అయితే అనంతరం ఆ చాక్లెట్లు కాలం చెల్లినవిగా గుర్తించారు.దాంతో వారు షాక్కు గురై మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పారిశుధ్య అధికారులు ఆ చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.