Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే 5 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులపై రాష్ర్ట క్యాబెనెట్ నేడు చర్చించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న ఈ సమావేశంలో ఆస్పత్రుల సత్వర నిర్మాణానికై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలిసింది. ఆస్పత్రుల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వరంగల్ చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణం, టిమ్స్, ఎల్.బి. నగర్, గడ్డి అన్నారం, అల్వాల్ లలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టనున్నారు.
పటాన్ చెరులో కార్మికులు, ఇతర ప్రజల అవసరాల కోసం కొత్తగా ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని క్యాబెనెట్ మంజూరు చేసింది. అన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖానాలను ఇకనుంచి. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గా నామకరణం చేశారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ఒక్క చోటనే అందించే సమీకృత వైద్య కళాశాలలుగా తీర్చిదిద్ది, సత్వరమే వైద్యసేవలను ప్రారంభించాలని వైద్యాధికారులను క్యాబెనెట్ ఆదేశించింది.
సబ్ కమిటీ ఏర్పాటు
రాష్ట్రంలోని అనాధలు, అనాధ శరణాలయాల స్థితిగతులు, సమస్యలు, అవగాహన విధాన రూపకల్పన కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులుగా మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, కేటీఆర్, గంగుల కమలాకర్, ఇంద్ర కరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి, అనాధలైన పిల్లల పూర్తి వివరాలు తెప్పించాలని వైద్యశాఖ కార్యదర్శిని క్యాబినెట్ ఆదేశించింది. అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి సమగ్ర సమాచారం తెప్పించాలని ఆదేశించారు. కరోనా పై కూడా క్యాబెనెట్ చర్చిస్తోంది.