Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నల్లగొండ జిల్లా హాలియాలో సోమవారం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ బయలుదేరి హెలికాప్టర్లో ఉదయం 10.40కి హాలియా చేరుకోనున్నారు. అక్కడ నుంచి ఉదయం 10.55కి సభాస్థలి వ్యవసాయ మార్కెట్యార్డ్కు చేరుకని మధ్యాహ్నం ఒంటిగంట వరకు సమావేశంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.10కి ఎమ్మెల్యే భగత్ నివాసంలో భోజనం చేస్తారు. విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సీఎం కేసీఆర్ హైదరాబాద్ బయల్దేరతారు.