Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు, సివిల్ సప్లై టాస్క్ఫోర్స్ అధికారులు మానకొండూర్ మండల కేంద్రంలో ఆదివారం పట్టుకున్నారు. సివిల్ సప్లై టాస్క్ఫోర్స్ అధికారులు పోలీసులతో కలిసి పక్కా సమాచారంతో సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రాజీవ్ నగర్ కాలనీలో AP 22 U 6481, AP 04 TX 1691 నంబరు గల రెండు డీసీఎం వ్యాన్లలో సుమారు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.7,80,000 ఉంటుందని అంచనా వేశారు. వాహనాల డ్రైవర్లు మోతే రాము, టేకు సంతోష్ లను విచారించగా రాజీవ్ నగర్ కాలనీకి చెందిన సిరిగిరి రాజయ్యకు చెందిన వ్యక్తి తమ వాహనాలను కిరాయికి మాట్లాడుకుని బోధన్ ప్రాంతానికి చెందిన ఓ రైస్ మిల్ కు తరలిస్తున్నట్టు తెలిపారు. రెండు వ్యాన్లను సీజ్ చేశారు. ఇద్దరు డ్రైవర్లు, పీడీఎస్ బియ్యం వ్యాపారి సిరిగిరి రాజయ్య లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు.