Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 49 కోట్ల మైలు రాయి దాటింది. ఒక్క జులైలోనే 13 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్టు ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రాలు, యూటీల వద్ద ఇంకా అందుబాటులో 3 కోట్లకుపైగా వ్యాక్సిన్లు నిల్వ ఉన్నట్టు తెలిపింది. తెలంగాణలో 2.2 కోట్ల మంది టీకాలకు అర్హులు ఉండగా, వీరిలో 1.12 కోట్ల మందికి ఇప్పటి వరకు సింగల్ డోస్ వేశారు. 33.79 లక్షల మందికి రెండు డోస్లు పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు.