Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టోక్యో ఒలంపిక్స్ లో మీరాబాయి చాను భారత్ కు రజత పతకం అందించగా అప్పటి నుంచి రెండో పతకం కోసం భారత్ అభిమానులు వేయి కండ్లతో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆ రెండో పతకం తెచ్చేది ఎవరా అనేదానికి పీవీ సింధు జవాబు చెప్పింది. బ్యాడ్మింటన్ లో కాంస్య పతకం గెలిచి భారత్ ను మరోసారి ఒలంపిక్స్ లో తల ఎత్తుకునేలా చేసింది.
ఆదివారం చైనా షట్లర్ హి బింగ్జియావో జరిగిన కాంస్య పతక పోరు మ్యాచ్ లో పీవీ సింధు దూకుడుగా ఆడి అదరగొట్టింది. మ్యాచ్ లో వరుసగా రెండు సెట్లు గెలిచి కాంస్య పతకం తన ఖాతాలో వేసుకుంది. మొదటి సెట్లో 21-13తో గెలిచిన సింధు రెండో సెట్లో 21-15 తేడాతో గెలిచింది.
ఈ కాంస్య పతకంతో ఈ మెగా ఈవెంట్లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారత మహిళగా సింధు నిలిచింది. 2016 రియో ఒలింపిక్స్లోనూ సింధు సిల్వర్ మెడల్ గెలవగా సింధు కంటే ముందు రెజ్లర్ సుశీల్కుమార్ మాత్రమే ఒలింపిక్స్లో భారత్ తరఫున రెండు మెడల్స్ గెలిచాడు.