Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టోక్యో ఒలంపిక్స్ లో ఆదివారం భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. కాసేపటి క్రితం పీవీ సింధు బ్యాడ్మింటన్ లో మ్యాచ్ గెలిచి కాంస్య పతకం సాధించగా తాజాగా గ్రేట్ బ్రిటన్ పై భారత హాకీ పురుషుల జట్టు క్వార్టర్స్ లో విజయం సాధించి సెమీస్ లోకి దూసుకెళ్లింది. 41 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్ సెమీఫైనల్లో భారత హాకీ జట్టు అడుగుపెట్టింది.
ఆదివారం గ్రేట్ బ్రిటన్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు 3-1 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో భారత్ కు మొదటి గోల్ మొదటి క్వార్టర్ లో దిల్ ప్రిత్ ద్వారా వచ్చింది. అనంతరం రెండో క్వార్టర్ లో గుర్జంత్ సింగ్ రెండో గోల్ చేయడంతో భారత్ కు ఎదురులేకుండా పోయింది. మూడో క్వార్టర్ చివరలో గ్రేట్ బ్రిటన్ గోల్ చేసినా మళ్లీ నాలుగో క్వార్టర్ లో భారత ఆటగాడు హార్థిక్ సింగ్ గోల్ చేసి భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. దాంతో సెమీ ఫైనల్ కు భారత్ అర్హత సాధించింది. సెమీస్ లో 2018 వరల్డ్ చాంపియన్స్ బెల్జియంతో భారత్ ఆడనుంది.