Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రశంసలు కురిపించారు. పీవీ సింధు దేశానికే గర్వకారణం.. అత్యద్భుతమైన ఒలింపియన్లలో ఆమె కూడా ఒకరు అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అలాగే ఒలింపిక్స్లో రెండో మెడల్ గెలిచిన సింధును అభినందిస్తూ నిలకడకు, అంకితభావానికి ఆమె మారుపేరుగా నిలుస్తోందని రాష్ట్రపతి కోవింద్ కూడా ట్వీట్ చేశారు. ఆదివారం జరిగిన మ్యాచ్లో సింధు.. చైనాకు చెందిన హి బింగ్జియావోపై 21-13, 21-15 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.