Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 455 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనాతో ముగ్గురు మృతి చెందారు. వైరస్ బారినపడిన వారిలో 648 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,45,406కు పెరిగింది. మొత్తం మరణాలు 3,805 చేరాయి. అలాగే ఈ రోజు వరకు మొత్తం 6,32,728 మంది కోలుకున్నారు. మరో 8,873 యాక్టివ్ కేసులున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 83,763 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.