Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రస్తుతం తనను చాలా ఎమోషన్స్ వెంటాడుతున్నాయని, కాంస్య పతకం గెలిచినందుకు సంతోషించాలో.. ఫైనల్లో ఆడే అవకాశాన్ని పోగొట్టుకున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదని పీవీ సింధు అన్నారు.. ఆదివారం కాంస్య పతకం గెలిచిన అనంతరం ఆమె మాట్లాడారు. తనకు చాలా సంతోషంగా ఉందని, కష్టానికి ప్రతిఫలం దక్కిందని చెప్పారు. తన దేశానికి మెడల్ సాధించిపెట్టినందుకు గర్వపడుతున్నానంది. తనపై ప్రేమాభిమానాలు చూపించిన అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పింది. తన గెలుపు కోసం తన కుటుంబసభ్యులు ఎంతో కష్టపడ్డారని, అలాగే స్పాన్సర్స్ కూడా ఎంతగానో ప్రోత్సహించారని అన్నారు. ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. 2024లో పారిస్లో జరగబోయే ఒలింపిక్స్లోనూ కచ్చితంగా పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది.
మరో వైపు పీవీ సింధుకు ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహా మరెందరో ప్రముఖులు సింధుకు అభినందనలు తెలిపారు. పీవీ సింధు ఈ నెల 3 న భారద్ రానున్నట్టు తెలిసింది.