Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో క్యాబినెట్ సమావేశం జరుగుతున్న సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో పంట రుణాల మాఫీపై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 50వేల రూపాయల్లోపు పంట రుణాల మాఫీని ఈ నెల 15నుంచి... నెలాఖరు లోపు పూర్తి చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు పంటరుణ మాఫీకి సంబంధించిన వివరాలను ఆర్థికశాఖ మంత్రివర్గం ముందు ఉంచగా కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారంతో ఇప్పటివరకు 25వేల వరకు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే 50వేల వరకు ఉన్న రుణాల మాఫీని ఈ నెల 15 నుంచి నెలాఖరు వరకు పూర్తి చేయాలని కేబినెట్ ఆదేశించింది.
ఈ నిర్ణయంతో 6లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు. అలాగే వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర వ్యవసాయ అంశాలపై సమీక్షించింది. తెలంగాణ పత్తికి ఉన్న ప్రత్యేక డిమాండ్ వల్ల సాగును ఇంకా పెంచాలని నిర్ణయించింది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.