Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పెట్రోలియం, గ్యాస్ రిటైలింగ్ సంస్థలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా పెంచాయి. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై రూ.73.5 పెంచాయి. నేటి నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. తాజా ధరల పెరుగుదలతో 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.1623.00గా ఉంది. అలాగే, వాణిజ్య సిలిండర్ ధర ముంబైలో రూ.1579.50గా , కోల్ కతాలో రూ.1629.00, చెన్నైలో రూ.1761.00గా ఉన్నాయి. అయితే 14.2 కిలోల దేశీయ సిలిండర్ ధరలలో ఎటువంటి మార్పులేదు. చమురు గ్యాస్ కంపెనీలు ప్రతి నెలా 1వ తేదీన వంట గ్యాస్ ధరలను సవరిస్తున్నాయి.
మరోవైపు దేశీయ గృహ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మార్పులు చేయలేదు. గత నెల జూలై 1న ధరలను రూ.25.50 పెంచారు. జూలైలో ధరల పెరుగుదలతో 14.2 కిలోల దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడుల్లో హైదరాబాద్లో రూ.887లుగా ఉంది.