Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్నేహితుల దినోత్సవం రోజే విషాదం చోటుచేసుకుంది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా సరదాగా గడిపేందుకు వెళ్లిన ఆరుగురు యువకుల్లో నీళ్లలో పడి ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జీజీ నడుకుడ వద్ద నది వద్ద సరదాగా గడిపేందుకు ఆరుగురు స్నేహితులు వచ్చారు. అయితే ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ బ్యాక్వాటర్లో ఆరుగురు పడిపోయారు. అది గమనించిన స్థానికులు అందులో ముగ్గురిని కాపాడారు. మిగితా ముగ్గురు కోసం గాలిస్తున్నారు.