Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వచ్చే నెలలో దక్షిణ కొరియా, అమెరికా దేశాలు సంయుక్తంగా మిలటరి డ్రిల్ ను నిర్వహించబోతున్నాయి. దీనిపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సోదరి కిమ్ యో జంగ్ దక్షిణ కోరియాకు హెచ్చరికలు జారీ చేశాయి. అమెరికాతో కలిసి మిలటరి డ్రిల్ను నిర్వహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటా యన్నారు. ఈ డ్రిల్ వలన తమ దేశానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఇప్పుడిప్పుడే ఇరు దేశాల మధ్య సంబంధాలు తిరిగి గాడిన పడుతున్నాయని, ఈ డ్రిల్ తో అవి పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుందన్నారు., దక్షిణ కొరియాపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోమని ఆమె హెచ్చరించారు.