Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ది కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్స్(సీపీజీఈటీ)-2021 పరీక్షలు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. అకడమిక్ ఇయర్ 2021-22లో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్టీయూ-హెచ్లో పీజీ, పీజీ డిప్లోమా.. అదేవిధంగా ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ ప్రొగ్రామ్స్కు ప్రవేశాలను ఆహ్వానిస్తున్నది. మొత్తం 53 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహణ జరగనుంది. ప్రవేశ పరీక్ష 90 నిమిషాల పాటు కొనసాగనుంది. ప్రశ్నాపత్రం 100 బహుళ ఐశ్చిక ప్రశ్నలను కలిగి ఉంటుంది. పూర్తి వివరాలకు అభ్యర్థులు www.osmania.ac.in, www.tscpget.com, www.ouadmissions.com, www.cpget.tsche.ac.in కు లాగినై చూడాల్సిందిగా అధికారులు పేర్కొన్నారు.