Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 57 ఏండ్లు నిండిన వారందరికీ పింఛన్ అందించేందుకు తక్షణమే చర్యలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ర్ట మంత్రి వర్గం సమావేశమైంది. వృద్ధాప్య పింఛన్ అర్హతను తెలంగాణ ప్రభుత్వం 57 ఏండ్లకు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ నిర్ణయంతో మరో 6,62,000 కొత్తగా పింఛన్లు అందనున్నట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో మొత్తం పింఛన్ లబ్ధిదారుల సంఖ్య 58 లక్షలకు పెరగనుంది.