Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఈ సంఘటన గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను కర్నూలు జిల్లా వాసులుగా గుర్తించారు. లారీ రాంగ్రూట్లో ఎదురుగా వచ్చి కారును ఢీకొట్టింది. కారు అనంతపురం నుంచి కర్నూలు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.