Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్నగర్: ఉరివేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకు న్నాడు. ఈ ఘటన ఉండవల్లిలో ఆది వారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివారాలు ప్రకారం.. మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన దాసు ఆలియాస్ రవికు మార్(29) వృత్తిరీత్యా సెంట్రింగ్ కార్మికుడిగా పని చేసేవాడు. అతడికి రెండు నెలల క్రితం ఇటిక్యాల మండలం ఆర్ గార్లపాడు గ్రామానికి చెందిన యువతితో వివాహం అయింది. ఆర్థిక సమస్యల కారణంగా ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయంపై పోలీసులను అడగగా ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.