Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొమురంభీం: జిల్లాలోని బెజ్జూరు మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఊట్ల అటవీ ప్రాంతంలో పెద్దగా అరుస్తూ అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఊట్ల అటవీ ప్రాంతంలో ఉన్న పశువుల మందపై పెద్దపులి దాడి చేసింది. దాడిలో ఒక ఆవు మృతి చెందగా..మరో రెండు ఆవులకు గాయాలయ్యాయి. దీంతో సమీప గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రైతులు పొలం దగ్గరకు వెళ్లాలంటే జంకుతున్నారు. పెద్దపులి సంచరిస్తున్న విషయాన్ని అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అటవీ అధికారులు పెద్దపులిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.