Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్థిక ఇబ్బందులతో గృహిణి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాయచూర్ గ్రామానికి చెందిన భజేందర్ అలియాస్ విజయ్ డ్రైవర్. 2004లో సోమాజిగూడకు చెందిన వీణ(35)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం న్యూబోయినపల్లి మాతాజీనగర్లో నివాసం ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీణ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి మహవీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.