Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హుజూరాబాద్లో ఈ నెల 16 నుంచి దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని, ఇందుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని క్యాబినెట్ ఆదేశించింది. ఈ పథకం అమలు, విధివిధానాల రూపకల్పనపై క్యాబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. దళిత బంధుకు చట్టబద్ధత కల్పించడానికి చట్టం తీసుకురావాలని క్యాబినెట్ అభిప్రాయపడింది. ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్కు బడ్జెట్లో కేటాయించిన నిధులు ఖర్చు చేయకుంటే క్యారీ ఫార్వర్డ్ చేసే విధానం తెచ్చామని, దళితబంధు దేశానికే దారిచూపే పథకం అవుతుందని పేర్కొంది. రెక్కల కష్టం తప్ప మరే ఆస్తిలేని దీనస్థితిలో దళితులు ఉన్నారని, రాష్ట్ర జనాభాలో 20 శాతం ఉన్న దళితుల చేతుల్లో కేవలం 13 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని, పేదరికానికి ఇంతకుమించి గీటురాయి లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ విషయంలో గిరిజనుల కన్నా ఎస్సీలు దయనీయ స్థితిలో ఉన్నారని చెప్పారు. దళిత బంధు లబ్ధిదారులు గ్రూప్గా ఏర్పడి పెద్ద పెట్టుబడితో ఒకే యూనిట్ పెట్టుకోవడానికి అనుమతి ఇస్తామన్నారు. ఉపాధి, వ్యాపార మార్గాలు ఎంచుకునే స్వేచ్ఛ వారికే ఇస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులు ఎంచుకున్న రంగాల్లో ట్రైనింగ్ ఇస్తామన్నారు.