Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో గతవారం నష్టాల్లో చలించిన మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సోమవారం ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 332 పాయింట్ల లాభంతో 52,918 వద్ద.. నిఫ్టీ 101 పాయింట్లు లాభపడి 15,864 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.39 వద్ద ట్రేడవుతోంది. అమెరికా సూచీలు క్రితం ట్రేడింగ్లో నష్టాలతో ముగియగా.. నేడు ఆసియా - పసిఫిక్ మార్కెట్లు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. బీఎస్ఈ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, టైటన్, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్అండ్టీ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, పవర్గ్రిడ్ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.