Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుపతి: తిరుపతిలోని గాయిత్రినగర్లో దోపిడీ దొంగలు హల్ చల్ చేశారు. మహిళా ప్రొపసర్ ఇంట్లోకి జోరబడి బంగారు గొలుసుతో పాటు నగదును అపహరించారు. ఇంట్లో నిద్రిస్తున్న విద్యార్థినులను కత్తితో బెదిరించి దుండగుడు అసభ్యంగా ప్రవర్తించాడు. అడ్డుకున్న యువతి చేతికి కత్తి గాయాలయ్యాయి. క్రైం, ఏఆర్ పల్లె పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటన జరిగిన ఇంటిని వెస్ట్ డీఎస్పీ నరసప్ప, క్రైం డీఎస్పీ మురళీధర్ పరిశీలించారు.