Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జమ్మూకశ్మీర్లో మరోసారి ఆదివారం రాత్రి మరో 4 డ్రోన్లు ప్రత్యక్షమయ్యాయి. సాంబ జిల్లాలోని బారి బ్రాహ్మణ ఏరియా వద్ద ఆదివారం రాత్రి 4 డ్రోన్లు కనిపించాయి. సాంబ జిల్లాలోని ఆర్మీ క్యాంప్ వద్ద కూడా డ్రోన్ కనిపించడంతో కలకలం రేగింది. డ్రోన్లు దూరంగా సంచరిస్తుండటంతో జమ్మూకశ్మీర్ పోలీసులు కాల్పులు జరపలేదు. డ్రోన్ల సంచారంతో జమ్మూకశ్మీర్ పోలీసులు 92 ఇన్ ఫాంట్రీ బ్రిగేడ్ కు సమాచారం అందించారు. జమ్మకశ్మీరులో తరచూ ఇలా డ్రోన్లు ప్రత్యక్షమవుతుండటంతో జమ్మూకశ్మీరు పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.