Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మహిళా న్యాయవాది హత్య కేసులో ఐదుగురు అరెస్టు అయ్యారు. పూర్వీకుల ఆస్తి విషయంలో తలెత్తిన వివాదంలో రైజున్నీసా అనే మహిళను ఆమె నలుగురు సోదరులు, సోదరి మహ్మద్ ఆరీఫ్ అలీ, రవూఫ్ అలీ, హసన్ అలీ, ఆసిఫ్ అలీ, సమీనా బేగంలు కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ ఐదుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. 400 గజాల స్థలం విషయంలో అక్కాచెళ్లెళ్లకు, అన్నాదమ్ములకు మధ్య గొడవలు జరిగాయి. రైజున్నీసా న్యాయవాది కావడంతో కోర్టులను ఆశ్రయించి స్టే తెస్తుందని సోదరులు భావించారు. ఆస్తుల గురించి మాట్లాడుకుందామని చెప్పి రైజున్నీసా ఇంటికి వెళ్లి నిందితులు హత్య చేశారు. నిందితులను మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. నిందితులకు 14రోజుల రిమాండ్ విధించారు.