Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కరోనా మొదలైనప్పటి నుండి టాలీవుడ్ పరిశ్రమకు చెందిన ప్రముఖుల మృతికి సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం. కరోనా వలన కొందరు మరణిస్తే, మరి కొందరు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. రెండేళ్ల సమయంలో ఎందరో లెజెండ్స్ని కోల్పోయాం. తాజాగా తెలుగు నటుడు ఇరుగు గిరధర్ మృతి చెందగా, ఆయన మృతిపై టాలీవుడ్ నివాళులు అర్పిస్తుంది. ఆరేళ్ల క్రితం గిరధిర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుండి మంచానికే పరిమితం ఆయన మానసికంగా కుంగిపోయారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. నటుడిగాను, దర్శకుడిగాను ఎన్నో సేవలు అందించిన ఆయన టాలీవుడ్ సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి, గుణశేఖర్, ఈవీవీ సత్యనారాయణ వంటివారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా గిరిధర్ పనిచేశారు. శుభముహూర్తం అనే సినిమాకు దర్శకత్వం వహించిన ఆయన తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఎక్స్ప్రెస్ రాజా, 100 పర్సంట్ లవ్, సర్దార్ గబ్బర్ సింగ్, శ్రీమంతుడు తదితర 20 సినిమాల్లో నటించారు.