Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను పెగాసస్, వ్యవసాయ చట్టాల అంశాలు కుదిపేస్తున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో, ప్రభుత్వం పట్టుదల నడుమ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ విపక్షాలు 'మాక్ పార్లమెంట్' ను నిర్వహించాలని భావిస్తున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష నేతలు భేటీ కానున్నారు. దీనిపై మంగళవారం నిర్ణయం తీసుకోనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై విపక్షాల వాదనలు, అభిప్రాయాలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, అందుకే సభల్లో చర్చలకు అంగీకరించట్లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పెగాసస్ వ్యవహారం దేశ భద్రతకు సంబంధించిన అంశమని, దీనిపై కేంద్రం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.