Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పరిహారంతో పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన మరియమ్మ మృతి ఘటనపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. మరియమ్మ మృతదేహానికి గత నెలలో రీపోస్ట్ మార్టం పూర్తయిందని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మృతురాలి కుటుంబానికి రూ.15లక్షల పరిహారం, ఉద్యోగం ఇచ్చినట్టు ఆయన న్యాయస్థానానికి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు వివరించారు. 'దేశంలో ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా' అని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. 'పరిహారంతో పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా' అని ప్రశ్నించింది. ఆలేరు మేజిస్ట్రేట్ నివేదిక అందిన తర్వాత ఈ కేసు విచారణ జరుపుతామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. నివేదిక అందిన 4వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరియమ్మ లాకప్ డెత్పై విచారణ సెప్టెంబరు 15కి వాయిదా వేసింది.