Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : చాబ్రాలో కుండపోత వర్షం కురిసింది. స్థానిక కోర్టు ఆవరణలో వాన నీరు నిలిచిపోయింది. దాదాపుగా ఒకటిన్నర నుంచి రెండు అడుగుల మేర వాన నీరు నిలిచిపోవడంతో న్యాయవాదులు, కక్షిదారులు కష్టాలు పడాల్సి వచ్చింది. పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ నిర్లక్ష్యం కారణంగా వాన నీరు నిలిచిపోయిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే.. కాంట్రాక్టరు ఏం చేస్తున్నారని, పనిచేయని కాంట్రాక్టర్పై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు.