Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ప్రారంభించాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు సూచీలు లాభాల్లోనే కొనసాగాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ తదితర హెవీ వెయిట్ కంపెనీలు లాభాల్లో ట్రేడ్ కావడం మార్కెట్లపై ప్రభావాన్ని చూపించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడి 52,950కి పెరిగింది. నిఫ్టీ 122 పాయింట్లు పుంజుకుని 15,885కి ఎగబాకింది.